బడ్జెట్‌ 2018 ; మోదీ సర్కార్‌ పల్లెబాట | big announcements to Agriculture sector in Budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ 2018 ; మోదీ సర్కార్‌ పల్లెబాట

Feb 1 2018 12:11 PM | Updated on Jun 4 2019 5:04 PM

big announcements to Agriculture sector in Budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కార్‌ గ్రామీణ భారతంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను పెంచాలన్నది ఈ ఏడాది అతిపెద్ద నిర్ణయం. ఈ రబీ పంటల నుంచే కనీస మద్దతు ధర.. ఉత్పాదన వ్యయానికంటే ఒకటిన్నర రెట్లు (150శాతం ఎక్కువ) ఉండాలని నిర్ణయించింది. వ్యవస్థీకృత సాగు, సామూహిక వ్యవసాయ విధానాలకు అధిక ప్రాదాన్యం ఇస్తున్నట్లు జైట్లీ చెప్పారు.

వ్యవసాయ రంగంపై జైట్లీ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
భారత్‌ వ్యవసాయ ఆధారిత దేశం.
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పనకు రూ.14.34 లక్షల కోట్లు కేటాయింపు
2022 నాటికి, అంటే 75వ స్వాతంత్ర్యవేడుకల నాటికి దేశంలోని రైతాంగాన్ని బలోపేతం చేస్తాం.
కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు(150 శాతానికి) పెంచుతున్నాం. ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే ఇది అమలులోకి వస్తుంది.
ఇందుకోసం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో నీతిఆయోగ్‌ చర్యలు జరిపి, స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తాం
ఇప్పటికే తీసుకొచ్చిన ఈ-నామ్‌ విధానం విజయవంతంగా అమలవుతున్నది
రైతులు మరింత బలోపేతం అయ్యేలా దేశవ్యాప్తంగా  22 వేల గ్రామీణ అగ్రి కల్చరల్‌ మార్కెట్లు ప్రారంభించబోతున్నాం.
2వేల కోట్ల మూలధనంతో ఈ అగ్రిమార్కెట్లను ఏర్పాటు చేస్తాం
ఆయా క్లస్టర్లలో జరిగే గ్రామీణ ఉపాధి హామీ, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేస్తూ, ఆన్‌లైన్‌ ద్వారా అగ్రిమార్కెట్లకు అనుసంధానం చేస్తాం
సామూహిక వ్యవసాయ విధానం (క్లసర్‌ మోడల్‌ కల్టివేషన్‌)ను కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తున్నది.లోకి తీసుకురానున్నాం.
2019 మార్చి నుంచే క్లస్టర్‌ మోడల్‌ను అమలు చేయబోతున్నాం
మారుమూల గ్రామాల్లో పండించిన పంటలు మార్కెట్‌ను చేరేలా.. ప్రధాన మంత్రి గ్రామీణ యోజన ద్వారా పెద్ద ఎత్తున రోడ్లను నిర్మించబోతున్నాం.
కౌలు రైతులకు రుణాలజారీని మరింత సులభతరం చేయబోతున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement