న్యూఢిల్లీ: చైనా సైనికులతో ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికులను స్మరిస్తూ బుధవారం లద్దాఖ్ రాజధాని లేహ్లో నివాళి కార్యక్రమం జరిగింది. జూన్ 15న సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న లోయలో చైనా భారత్ సైనికులు ముఖాముఖి తలపడటం తెల్సిందే. అమరులైన వారిలో తెలుగుతేజం కల్నల్ సంతోష్బాబు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ వీర జవాన్ల త్యాగాలు వృథాకావని వ్యాఖ్యానిం చారు. దేశ ఐక్యత, సార్వభౌమత్యం తమకు ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. భారత్ శాంతిని కోరుకుంటోందని, అదే సమయంలో తగిన జవాబు కూడా ఇవ్వగలదని చెప్పారు. మరోవైపు ఈ దాడిలో పాల్గొన్న నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని ఆర్మీ అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా వైపు కూడా దాదాపు 45 మంది సైనికులు మరణించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ దాడి ఆయుధాలతోగాక పిడిగుద్దులు, రాళ్లు విసురుకోవడంతో జరిగిందని అన్నారు. అయితే చైనా సైనికులు మాత్రం రాడ్లు, మేకులు కలిగిన ఆయుధాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖకు లోపలే భారత్ తమ కార్యకలాపాలను సాగిస్తోందని, చైనా నుంచి దీన్నే ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాక్ శ్రీవాస్తవ చెప్పారు.
అమరులైన భారత సైనికులు
భికుమల్ల సంతోష్ బాబు(సూర్యాపేట), నుదరమ్ సోరెన్(మయూర్భంజ్), మన్దీప్ సింగ్ (పటియాలా), సత్నామ్ సింగ్(గుర్దాస్పూర్), కె. పలాని(మధురై), సునిల్ కుమార్(పట్నా), బిపుల్ రాయ్(మీరట్ సిటీ), దీపక్ కుమార్(రెవా), రాజేష్ ఒరాంగ్(బిర్గుమ్), కుందన్ కుమార్ ఓజా(సహిబ్గంజ్),గణేష్ రామ్(కాంకెర్), చంద్రకాంత ప్రధాన్(కందమాల్), అంకుష్(హమిర్పుర్), గుర్బిందర్(సంగ్రుర్), గుర్తెజ్ సింగ్(మన్సా), చందన్ కుమార్(భోజ్పూర్), కుందన్ కుమార్(సహర్సా), అమన్ కుమార్(సమస్తిపూర్), జై కిషోర్ సింగ్ (వైశాలి), గణేశ్ హన్సా్ద(ఈస్ట్ సింగ్బుమ్)
వీరులకు అశ్రునివాళి
Published Thu, Jun 18 2020 4:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement