breaking news
Indian army kills
-
వీరులకు అశ్రునివాళి
న్యూఢిల్లీ: చైనా సైనికులతో ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికులను స్మరిస్తూ బుధవారం లద్దాఖ్ రాజధాని లేహ్లో నివాళి కార్యక్రమం జరిగింది. జూన్ 15న సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న లోయలో చైనా భారత్ సైనికులు ముఖాముఖి తలపడటం తెల్సిందే. అమరులైన వారిలో తెలుగుతేజం కల్నల్ సంతోష్బాబు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ వీర జవాన్ల త్యాగాలు వృథాకావని వ్యాఖ్యానిం చారు. దేశ ఐక్యత, సార్వభౌమత్యం తమకు ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. భారత్ శాంతిని కోరుకుంటోందని, అదే సమయంలో తగిన జవాబు కూడా ఇవ్వగలదని చెప్పారు. మరోవైపు ఈ దాడిలో పాల్గొన్న నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని ఆర్మీ అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా వైపు కూడా దాదాపు 45 మంది సైనికులు మరణించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ దాడి ఆయుధాలతోగాక పిడిగుద్దులు, రాళ్లు విసురుకోవడంతో జరిగిందని అన్నారు. అయితే చైనా సైనికులు మాత్రం రాడ్లు, మేకులు కలిగిన ఆయుధాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖకు లోపలే భారత్ తమ కార్యకలాపాలను సాగిస్తోందని, చైనా నుంచి దీన్నే ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాక్ శ్రీవాస్తవ చెప్పారు. అమరులైన భారత సైనికులు భికుమల్ల సంతోష్ బాబు(సూర్యాపేట), నుదరమ్ సోరెన్(మయూర్భంజ్), మన్దీప్ సింగ్ (పటియాలా), సత్నామ్ సింగ్(గుర్దాస్పూర్), కె. పలాని(మధురై), సునిల్ కుమార్(పట్నా), బిపుల్ రాయ్(మీరట్ సిటీ), దీపక్ కుమార్(రెవా), రాజేష్ ఒరాంగ్(బిర్గుమ్), కుందన్ కుమార్ ఓజా(సహిబ్గంజ్),గణేష్ రామ్(కాంకెర్), చంద్రకాంత ప్రధాన్(కందమాల్), అంకుష్(హమిర్పుర్), గుర్బిందర్(సంగ్రుర్), గుర్తెజ్ సింగ్(మన్సా), చందన్ కుమార్(భోజ్పూర్), కుందన్ కుమార్(సహర్సా), అమన్ కుమార్(సమస్తిపూర్), జై కిషోర్ సింగ్ (వైశాలి), గణేశ్ హన్సా్ద(ఈస్ట్ సింగ్బుమ్) -
పాక్ తీవ్రవాదులను హతమార్చిన భారత సైన్యం
శ్రీనగర్ః భారత సరిహద్దుల్లో ముగ్గురు పాకిస్థాన్ తీవ్ర వాదులను ఆదివారం కాల్చి చంపినట్లు భారత భద్రతా బలగాలు వెల్లడించాయి. వివాదాస్పద కశ్మీర్ ప్రాంతంలోని పాకిస్థాన్ సరిహద్దుల్లో రెండు రోజుల క్రితం ఓ గన్ మెన్ పై ముష్కరుల దాడి అనంతరం భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు తీవ్రవాదుల్ని హతమార్చినట్లు భద్రతా బలగాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఉత్తర కశ్మీర్ తంగ్ధర్ సెక్టార్ ప్రాంతంలో భారత్ లోకి చొరబడేందుకు యత్నంచిన ముగ్గురు పాకిస్థాన్ మిలిటెంట్లను హతమార్చి, వారినుంచీ 3 రైఫిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు ల్యూటినెంట్ కొలొనెల్ మనీష్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ కశ్మీర్ లోయలో భారత బలగాలు 103 మంది తీవ్రవాదులను హతమార్చాయని, ఇటీవలి సంవత్సరాల్లో ఇదే అత్యధిక సంఖ్యగా ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం జూలై వరకూ 56 మంది మిలిటెంట్లు కశ్మీర్ లోకి చొరబడగా, గతేడాది ఇదే కాలంలో 36 మంది చొరబడ్డట్లు అధికారిక అంచనాల ప్రకారం తెలుస్తోంది. భారతదేశంలో భాగమైన జమ్ము కశ్మీర్ లో సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఓ పక్క భారత్ ప్రయత్నిస్తుండగా.. పాకిస్తాన్ మాత్రం ఇటువంటి కార్యకలాపాలను ఖండిస్తోంది. మెజారిటీ ముస్లింలు కలిగిన కశ్మీర్ ప్రాంతంలో జూలై 8న ఓ పాకిస్థానీ మిలిటెంట్ ను భద్రతా బలగాలు హతమార్చిన నేపథ్యంలో తలెత్తిన ఆందోళనల్లో ఇప్పటివరకూ 65 మంది మరణించగా.. సుమారు 6,000 మంది గాయపడ్డారు.