ముజఫర్‌నగర్‌ అత్యాచారాలపై ఆమ్నెస్టీ నివేదిక


న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 2013 నాటి అల్లర్ల సమయంలో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారాలపై జరుగుతున్న విచారణలో జాప్యం.. బాధితుల దయనీయ స్థితిని తెలియజేస్తోందంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భారత విభాగం గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. ‘లాసింగ్‌ ఫెయిత్‌: ద ముజఫర్‌నగర్‌ గ్యాంగ్‌రేప్‌ సరై్వవర్స్‌’పేరుతో తీసుకువచ్చిన ఈ నివేదిక, మహిళలను దాడుల నుంచి రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది.


ఆ తర్వాత కేసుల విచారణ స్థితి గురించి బాధితులకు సమాచారం అందించడంలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆక్షేపించింది. మత, కుల ఘర్షణల్లో మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు కావడం ఇదే తొలిసారి కాబట్టి, ఈ కేసులను ప్రభుత్వమే నీరుగారుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top