
‘పార్టీకోసం ఏళ్ల తరబడి పనిచేశా.. విలువలేదు’
కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి ఏకే వాలియా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీలోని వారికి కాకుండా బయటి వారికి టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. ‘నేను చాలా బాధతో ఉన్నాను. నేను పార్టీకోసం ఏళ్ల తరబడి అలుపులేకుండా చేశాను. ఇప్పుడు నా మాట ఎవరూ వినలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో షీలా దీక్షిత్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన పలు శాఖలకు బాధ్యతలు వహించారు. వృత్తిపరంగా వైద్యుడైన ఆయన తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ నియోజకవర్గం నుంచి బాధ్యతలు వహించారు.