breaking news
quit the party
-
గుడ్ బై.. గుడ్ లక్.. కాంగ్రెస్కు షాకిచ్చిన పీసీసీ మాజీ చీఫ్
దేశంలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాక్లు తగులుతున్నాయి. ఎలాగైనా మరోసారి పార్టీకి పూర్వవైభవం తేవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్తాన్లోని జైపూర్లో చింతన్ శిబర్ నిర్వహించి హస్తం పార్టీలో సంస్థాగత మార్పులకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పార్టీని వీడుతూ.. గుడ్ లక్.. గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ శనివారం కాంగ్రెస్ పార్టీకి గుబ్ బై చెప్పారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో జాకర్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత జాకర్ సీఎం రేసులో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, అధిష్టానం అందరికీ షాకిస్తూ ఛన్నీని సీఎం సీటులో కూర్చోబెట్టింది. దీంతో జాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పంజాబ్లో అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత ఆయన స్థానంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఛన్నీని నియమించడంతో అధిష్టానాన్ని జాకర్ ప్రశ్నించారు. ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ, ఛన్నీ ఓటమి చెందడంతో జాకర్ మరోసారి కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో అనుహ్యంగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. శనివారం ఫేస్ బుక్ లైవ్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వీడుతున్నానని చెబుతూ.. గుడ్ బై.. గుడ్ లక్ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: లౌడ్స్పీకర్ల వివాదం..చంపేస్తామని బెదిరింపులు.. రాజ్ ఠాక్రేకు భద్రత పెంపు -
‘పార్టీకోసం ఏళ్ల తరబడి పనిచేశా.. విలువలేదు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి ఏకే వాలియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఎంతో కాలంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పేశారు. దీంతో ఢిల్లీ కాంగ్రెస్కు షాకిచ్చినట్లయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని, సీట్లను డబ్బులకు అమ్ముకున్నారని వాలియా ఆరోపణలు చేశారు. పార్టీలోని వారికి కాకుండా బయటి వారికి టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. ‘నేను చాలా బాధతో ఉన్నాను. నేను పార్టీకోసం ఏళ్ల తరబడి అలుపులేకుండా చేశాను. ఇప్పుడు నా మాట ఎవరూ వినలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో షీలా దీక్షిత్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన పలు శాఖలకు బాధ్యతలు వహించారు. వృత్తిపరంగా వైద్యుడైన ఆయన తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ నియోజకవర్గం నుంచి బాధ్యతలు వహించారు.