పట్టాలపై విమానం! | Aircraft on the rails! | Sakshi
Sakshi News home page

పట్టాలపై విమానం!

Sep 5 2016 2:15 AM | Updated on Sep 4 2017 12:18 PM

పట్టాలపై విమానం!

పట్టాలపై విమానం!

భారత రైల్వేలో తేజస్ రైళ్లు అత్యాధునిక సదుపాయాలతో సిద్ధంకానున్నాయి.

న్యూఢిల్లీ: భారత రైల్వేలో తేజస్ రైళ్లు అత్యాధునిక సదుపాయాలతో సిద్ధంకానున్నాయి. శతాబ్ది రైళ్ల కంటే 20 నుంచి 30 శాతం చార్జీలు అధికంగా వసూలు చేయాలని భావిస్తున్న ఈ ట్రైన్లలో ప్రయాణం ఓ దివ్యానుభూతిని పంచుతుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపుదిద్దుకుంటున్న ఈ రైళ్లలో వాణిజ్య విమానాల తరహాలో అటెండెంట్లతో సహా సకల సదుపాయాలు ఉంటాయి. వైఫై సదుపాయం, మనకు నచ్చే వంటకాలు, డ్రింక్ వెండింగ్ మెషీన్లు, సీసీటీవీలు ఉంటాయి.

కోచ్‌లలో అద్భుతమైన ఇంటీరియర్ డెకరేషన్ ఉంటుంది. ఢిల్లీ-లక్నో మార్గంలో పగటిపూట ప్రయాణం కోసం ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఈ తేజస్ రైళ్లలో ఎగ్జిక్యూటివ్ క్లాస్, చైర్‌కార్లు ఉంటాయి. రైల్వేల్లో రెండు భారీ సంస్కర ణలు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. రైలు చార్జీల నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడంతోపాటు రైల్వేల్లో మౌలిక వసతుల అభివృద్ధి నిధిని త్వరలో ప్రారంభించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement