వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కి.మీ. పాదయాత్ర | 1100 kilometers walk from wardha to delhi | Sakshi
Sakshi News home page

వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కి.మీ. పాదయాత్ర

Mar 4 2015 1:38 AM | Updated on Sep 2 2017 10:14 PM

వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కి.మీ. పాదయాత్ర

వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కి.మీ. పాదయాత్ర

కేంద్రం ప్రతిపాదించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని రైతు వ్యతిరేక నిబంధనలపై సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే సమరశంఖం పూరించారు.

 భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై హజారే సమరశంఖం
 ముంబై: కేంద్రం ప్రతిపాదించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని రైతు వ్యతిరేక నిబంధనలపై సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే సమరశంఖం పూరించారు. ఈ నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు మహారాష్ట్రలోని వార్ధా నుంచి ఢిల్లీకి 1,100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వార్ధాలోని గాంధీ ఆశ్రమం నుంచి మొదలయ్యే యాత్ర ఢి ల్లీలోని రామ్‌లీలా మైదానంలో ముగుస్తుందన్నారు. ఈ యాత్రకు సుమారు 3 నెలల సమయం పడుతుందన్నారు. ఈ నెల 9న సేవాగ్రామ్‌లో జరిగే సమావేశంలో పాదయాత్ర షెడ్యూల్‌ను నిర్ణయిస్తామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement