విశాఖలో రూ.500 కోట్ల స్కాం | Rs.500 cr's land pooling scam is occured in vizag, says BJP MLA vishnu kumar raju | Sakshi
Sakshi News home page

విశాఖలో రూ.500 కోట్ల స్కాం

Dec 15 2016 4:58 PM | Updated on May 3 2018 3:20 PM

విశాఖలో రూ.500 కోట్ల స్కాం - Sakshi

విశాఖలో రూ.500 కోట్ల స్కాం

విశాఖపట్టణం జిల్లా పరిధిలో జరిగిన ల్యాండ్ పూలింగ్ లో భారీ అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గురువారం ఆరోపించారు.

విజయవాడ: విశాఖపట్టణం జిల్లా పరిధిలో జరిగిన ల్యాండ్ పూలింగ్ లో భారీ అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గురువారం ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరిట రూ.500కోట్ల కుంభకోణం జరుగుతోందని అన్నారు. కుంభకోణంపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేదల భూమిపై బడా బాబులు కన్నేశారని అన్నారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేసి కోట్లు కొల్లగొట్టాలని స్కెచ్ వేశారని ఆరోపించారు. భీమిలి ప్రాంతంలోనే ల్యాండ్ పూలింగ్ లో అత్యధికంగా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement