బీజింగ్: హాలీవుడ్ మూవీ 'ట్రాన్స్ ఫార్మర్స్' నిర్మాతలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెనా సినీక్ ఏరియాకు చెందిన ఓ పార్కుకు ఆ మూవీ నిర్మాతలు దాదాపు మూడు లక్షల అమెరికా డాలర్లు పరిహారం చెల్లించనుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. ట్రాన్స్ ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ ఎక్స్ టింక్షన్' మూవీలో కొన్ని సీన్లను చైనా ఉలుంగ్ సినిక్ ఏరియా, ఆ దేశ పర్యాటక ప్రాంతంలో చిత్రీకరించారు. ఇందుకు గానూ మొదట ఆ మూవీ యూనిట్ పర్మిషన్ తీసుకుంది. ఆ టూరిస్ట్ ప్లేస్ లోగో కచ్చితంగా మూవీలో చూపించాలని ఒప్పందం చేసుకున్నారు.
విడుదలైన ఈ మూవీలో పర్యాటక ప్రాంతం సీన్లున్నాయి. కానీ ఆ ఫారెస్ట్ లోగో కనిపించలేదు. దీంతో చైనాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీకి సంబంధించిన కొన్ని సీన్లపై చైనా అభ్యంతరం చెప్పింది. మూవీలో లోగో చూపించలేదని ఒప్పందాన్ని ఉల్లంఘించరాని చైనా వారు 2014లో దావా వేశారు. 20 మిలియన్లకు పైగా చెనీస్ యువాన్లను పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ఈ కేసు తీర్పు వెలువడిందని, ఆ మూవీ నిర్మాతలు చైనా పార్కుకు, సంబంధిత పర్యాటకశాఖకు 3 లక్షల డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.2కోట్లు) చెల్లించాలని తుదితీర్పు వచ్చింది. మరోవైపు ట్రాన్స్ ఫార్మర్స్ మూవీ ఐదో పార్ట్ వచ్చే విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధంగా ఉంది.
ఆ నిర్మాతలు రూ.2కోట్లు కట్టాల్సిందే!
Published Fri, Oct 28 2016 3:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
Advertisement