బెల్లం రామకృష్ణారెడ్డి
‘దృశ్యకావ్యం’ సినిమా దర్శకునిగా నా తొలి ప్రయత్నం. అయినా ప్రేక్షకులు కొత్తా పాతా అనే తేడా చూపకుండా నా ప్రయత్నాన్ని ఆదరించారు. అందుకు వారికి నా కృతజ్ఞతలు’’ అని బెల్లం రామకృష్ణారెడ్డి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా స్వీయ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ‘దృశ్యకావ్యం’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా బెల్లం రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు...
నేనీ సినిమా కోసం అనుకున్న స్క్రిప్ట్ వేరు... తీసిన సినిమా వేరు. నేను షూటింగ్ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్నాక ‘రాజుగారి గది’ విడుదలైంది. అందుకే ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందనుకున్నాను. పోస్టర్స్ ద్వారానే ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పాలనుకున్నాను. అందుకే, పోస్టర్స్లో దెయ్యాన్ని చూపించాను. దాంతో ఇది హారర్, థ్రిల్లర్ మూవీ అని ఫిక్స్ అయి ప్రేక్షకులు థియేటర్కు వచ్చారు. దెయ్యాన్ని పోస్టర్స్లో చూసి, సినిమాకు వచ్చిన వాళ్లల్లో కొంత మంది నిరాశ చెందిన మాట వాస్తవమే. వాళ్ల సంగతలా ఉంచితే, ఈ సినిమా చూసి నాకు తెలిసిన వాళ్లు, తెలియనవాళ్లు ఫోన్ చేసి నన్ను అభినందిస్తున్నారు. నేను స్వయంగా థియేటర్కు వెళ్లి సినిమా చూశాను. సెంటిమెంట్ సీన్స్కు బాగా కనెక్ట్ అవుతున్నారు.
ఈ సినిమాలో చిన్నపిల్లలను చూస్తూ ఉంటే తమ ఇంట్లోవాళ్లను చూస్తున్నట్టే అనిపిస్తోందని చాలామంది అన్నారు. ఆ విషయాన్ని కొంత మంది నా దగ్గర ప్రస్తావించారు కూడా. హీరో శ్రీకాంత్గారు కూడా నా ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. నేను దేనికైతే ప్రేక్షకులు రియాక్ట్ అవుతారనుకున్నానో, దానికే కనెక్ట్ అయ్యారు. హీరోయిన్ దృక్కోణంలో సినిమా చూపించడం చాలా మందికి బాగా నచ్చింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు ‘ప్రాణం’ ఫేమ్ కమలాకర్ స్వరపరిచిన ఫ్లూట్ బిట్ అయితే చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.
దర్శకుణ్ణి కావాలనే కోరికతోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. నిర్మాతగా నాకిది మూడో చిత్రం. ‘భద్రమ్’ అనే తమిళ డబ్బింగ్ చిత్రం తర్వాత శ్రీకాంత్ హీరోగా ‘వీడికి దూకుడెక్కువ’ అనే చిత్రాన్ని నిర్మించాను. కానీ, ఆ చిత్రం విషయంలో డిస్ట్రిబ్యూటర్లు కొంత నిరాశ వ్యక్తం చేశారు. ఇక... నా లాంటి కొత్తవాళ్లు దర్శకత్వం వహించే చిత్రాలను ఎవరు చూడరు కదా. అందుకే ఎవరికీ నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నేనే స్వయంగా పంపిణీ చేశాను.
‘దృశ్యకావ్యం’ కథకు మంచి స్కోప్ ఉంది. చివరికి ఎవరు చనిపోయారు? అనే విషయాన్ని రివీల్ చేశాక, దానికి తగ్గ కారణాలను కూడా డిస్కస్ చేయాలి. అందుకే ఫుల్ కన్క్లూషన్ ఇవ్వకుండా సీక్వెల్ తీస్తామని ప్రకటించాను. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే మళ్లీ అదే జానర్లో సినిమా వస్తే కొత్త దర్శకుణ్ణి కాబట్టి నా మీద ఓ ముద్ర పడిపోతుంది. అందుకే సీక్వెల్ని ఇప్పట్లో తీయదల్చుకోలేదు. కొంత గ్యాప్ ఇచ్చి తీస్తాను.
ప్రస్తుతం నా దగ్గర మూడు, నాలుగు కథలున్నాయి. నిఖిల్, సాయిధరమ్తేజ్లతో సినిమాలు చేద్దామనుకుంటున్నా. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే అన్ని వివరాలూ వెల్లడిస్తాను.
అందుకే దృశ్యకావ్యం బాగా నచ్చింది
Published Sat, Mar 26 2016 10:27 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...70 ఏళ్ల వయసులోనూ గర్భధారణ
మీ ఓటు దేనికి?
డిసైడ్ చేసేది.. ఆమే!
భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్
KKR vs MI: కేకేఆర్తో ముంబై పోరు.. తుది జట్లు ఇవే
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
తప్పక చదవండి
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
- డిసైడ్ చేసేది.. ఆమే!
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement