సినిమా సినిమాకీ సరికొత్త పాత్రలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు సుధీర్బాబు. తెలుగులో హీరోగా చేస్తున్న ఆయన హిందీ ‘బాఘీ’ చిత్రంలో విలన్గా నటించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన ‘బాఘీ’ విశేషాలు, భవిష్యత్ ప్రాజెక్ట్స్ వివరాలు చెప్పారు.
♦ ‘ఏమాయ చేశావే’ చిత్రంలో నెగటివ్ పాత్రలో టాలీవుడ్కి పరిచయమయ్యా. తెలుగు హిట్ మూవీ ‘వర్షం’కి రీమేక్గా తెరకెక్కిన ‘బాఘీ’ చిత్రంలో ప్రతినాయ కుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టా. నేను హిందీలో విలన్గా నటించడంపై మొదట నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత అందరికీ నచ్చింది. యూ ట్యూబ్లో పన్నెండు వేల మంది వీక్షించారు.
♦ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఫాదర్ అయిన ప్రముఖ నటుడు శక్తీకపూర్ ఫోన్ చేసి బాగా నటించావు, బాలీవుడ్లో మరిన్ని అవకాశాలొస్తాయన్నారు. ఆయన అన్నట్టే ఆఫర్లు వస్తున్నాయి. ఏది పడితే అది ఒప్పుకోకుండా మంచి సినిమాలనే చేయాలనుకుంటున్నా. హిందీలో హీరోగా అయితేనే చేస్తా అనే షరతు విధించకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్ర అయినా చేస్తా. అవకాశం వస్తే తెలుగులో కూడా విలన్గా నటిస్తా. విలన్గా చేస్తే మహిళా ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోతుందనుకున్నా. కానీ, ‘బాఘీ’ చూసిన తర్వాత ఎక్కువ మంది అమ్మాయిలే నన్ను అభినందిస్తూ మెసేజ్లు చేస్తున్నారు.
♦ ‘భలే మంచి రోజు’ చిత్రానికి కో డెరైక్టర్గా పనిచేసిన శ్రీరాం రెడ్డి చెప్పిన కథ నచ్చింది. ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళతాం. దాని తర్వాత బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నా. నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ఆ పాత్రకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ భాషల్లో ఆ చిత్రం తెరకెక్కనుంది.
అమ్మాయిలే ఎక్కువ మెసేజ్లు చేస్తున్నారు
Published Wed, May 4 2016 9:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement