పాటతో ప్యాకప్
మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, ప్రకాష్రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. దీంతో షూటింగ్కు చిత్రబృందం గుమ్మడికాయ కొట్టింది. హైదరాబాద్లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరించిన ‘మైండ్ బ్లాక్..’ పాటతో సినిమా పూర్తయిందని తెలిసింది. ‘‘ఈ ఏడాది జూలై 5న ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, డిసెంబరు 18న ముగించాం. ఈ సినిమా షూటింగ్ మంచి ప్రయాణంలా సాగింది’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి11న సంక్రాంతికి విడుదల కానుంది.