తొమ్మిదేళ్ల తరువాత మళ్లీ నయనతారతో కలిసి నటిస్తున్నానని యువ నటుడు జీవా పేర్కొన్నారు. వీరిది హిట్ జంట. ఇంతకు ముందు 'ఈ' చిత్రంలో తొలిసారిగా కలసి నటించారు. ఆ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఇన్నాళ్లకు తిరునాళ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని సూపర్గుడ్ ఫిలింస్ సంస్థలో పలు సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు నిర్వహించిన ఎం.సెంథిల్కుమార్ నిర్మాతగా మారి కోదండపాణి ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు.
అంబాసముద్రపు అంబానీ చిత్రం ఫేమ్ పీఎస్.రామనాథ్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలు చేపట్టిన ఈ తిరునాళ్కు 'శ్రీ'గా పేరు మార్చుకున్న శ్రీకాంత్దేవా సంగీతాన్ని, మహేశ్ ముత్తుసామి చాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వివరాలను చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ వెల్లడించారు. చిత్ర హీరో జీవా మాట్లాడుతూ ఒక మంచి పాజిటివ్ టీమ్తో చేస్తున్న కమర్షియల్ చిత్రం తిరునాళ్ అని చెప్పారు. సెంథిల్కుమార్ను నిర్మాత అనడం కంటే తన కుటుంబసభ్యుడిగా పేర్కొనవచ్చు అని అన్నారు. తమ సూపర్గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మించిన చి త్ర విజయాలన్నిం టి వెనుక సెంథిల్కుమార్ ఉన్నారని పేర్కొన్నారు.
ఇక తిరునాళ్ చిత్రం విషయానికొస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుం బకథా చిత్రం అని తెలిపారు.ఇందు లో చిత్రం అంతా లుంగీ కట్టి నటిం చానన్నారు. దర్శకుడు రామనాధ్ స్క్రిప్ట్తో పాటు ఒక సీడీని తనకు అందించారన్నారు. ఈ కథకు నాయికగా నయనతార అయితే బాగుం టుందని అనిపించిందని ఆమెను సంప్రదించగా కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో చాలా మంది ఇతర నటీమణులను పరిశీలించినా ఎందుకనో నయనతార అయితేనే బాగుం టుందని పించడంతో ఆలస్యం అయినా పర్వాలేదని ఆమెనే ఎంపిక చేశామని తెలిపారు. నయనతార లంగా ఓణీ ధరించి పల్లెటూరి అమ్మాయిగా చాలా చక్కగా నటించారని చెప్పారు. అలా నయనతో తొమ్మిది సంవత్సరాల తరువాత మళ్లీ నటించానని అన్నారు. రౌడీయిజం వద్దని చెప్పే తిరునాళ్ చిత్రంలో జీవా పాత్ర చాలా ఫ్రెష్గా ఉంటుందని దర్శకుడు రామనాథ్ చెప్పారు.
ఆమె అయితేనే బాగుంటుంది
Published Sat, Mar 26 2016 2:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement