వైఎస్‌ జగన్‌ ఘనవిజయం.. ‘యాత్ర 2’

Mahi V Raghav Congratulates Ys Jaganmohan Reddy - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి. వైఎస్‌ జగన్‌ విజయం ఖాయమైపోవటంతో ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. సుధీర్‌ బాబు, రవితేజ లాంటి సినీ హీరోలు కూడా వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

ఇక దివంగత మహానేత  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వీ రాఘవ కూడా వైఎస్‌ఆర్సీపీ సునామీపై స్పందించారు. వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ‘మీరు భవిష్యత్‌ తరాలకు చెప్పాల్సినంత గొప్ప విజయాన్ని అందించారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు యాత్ర 2 (#Yatra2) అనే ట్యాగ్‌ను కూడా జోడించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top