యాభై రోజుల వేడుకలు చూసి ఎన్నాళ్లయ్యిందో! | Loukyam Movie 50 Days Celebrations | Sakshi
Sakshi News home page

యాభై రోజుల వేడుకలు చూసి ఎన్నాళ్లయ్యిందో!

Nov 17 2014 11:44 PM | Updated on Sep 2 2017 4:38 PM

యాభై రోజుల వేడుకలు చూసి ఎన్నాళ్లయ్యిందో!

యాభై రోజుల వేడుకలు చూసి ఎన్నాళ్లయ్యిందో!

దాదాపు ఏడాదిన్నర పాటు ‘లౌక్యం’ చిత్ర కథపై కసరత్తులు చేశాం. దానికి తగ్గ ప్రతిఫలం లభించింది.

 ‘‘దాదాపు ఏడాదిన్నర పాటు ‘లౌక్యం’ చిత్ర కథపై కసరత్తులు చేశాం. దానికి తగ్గ ప్రతిఫలం లభించింది. గోపీచంద్‌కి ఇది సొంత సంస్థ లాంటిది. విదేశాల్లో ఈ చిత్రం పాటలు చిత్రీకరించినప్పుడు గోపీచంద్ తానే నిర్మాతలా, ప్రొడక్షన్ మేనేజర్‌లా దగ్గరుండి చూసుకున్నారు’’ అన్నారు చిత్ర నిర్మాత వి. ఆనందప్రసాద్. గోపీచంద్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘లౌక్యం’ చిత్ర అర్ధశతదినోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘‘ఇన్నాళ్లూ నేను లౌక్యంగా మాట్లాడింది లేదు. కానీ, ఈ చిత్రం చూసిన తర్వాత మాట్లాడక తప్పడం లేదు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీలో గోపీచంద్ అద్భుతంగా నటించాడు. రకుల్ అందంగా ఉంది.
 
 కోన వెంకట్, గోపీమోహన్ వినోదానికి మారుపేరు అనిపించుకున్నారు ‘అన్నమయ్య’ చిత్రానికి నా దగ్గర పని చేసిన శ్రీవాస్ ఈ చిత్రాన్ని గొప్పగా తీశాడు’’ అన్నారు. యాభై రోజుల పండగలు చూసి ఎన్నాళ్లయ్యిందో... ఇలాంటి వేడుకలు చాలా జరగాలని కోరుకుంటున్నానని శ్రీకాంత్ చెప్పారు. గోపీచంద్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం రూపొందడానికి ప్రధాన కారకుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఈ మూడూ సినిమాకి ప్లస్ అయ్యాయి. శ్రీవాస్ చాలా లౌక్యంగా ఈ చిత్రం తీశాడు’’ అన్నారు. హీరోయిన్‌ని బాగా చూపించావని రాఘవేంద్రరావుగారు ప్రశంసిస్తే, దాసరిగారు అభినందిస్తూ మా యూనిట్ అందరికీ పుష్పగుచ్ఛాలు పంపించారని శ్రీవాస్ చెప్పారు. పంపిణీదారులుగా మారిన తనకు, శ్రీధర్ సీపాన, శ్రీవాస్‌కు ఈ చిత్రం మంచి అనుభూతిని మిగిల్చిందని రచయిత కోన వెంకట్ తెలిపారు. ఈ వేడుకలో అన్నేరవి, రచయిత శ్రీధర్ సీపాన, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement