హోటల్‌ కార్మికులతో కేరళ నటి వాగ్వాదం | Kerala Actress Fight With Hotel Management in Tamil Nadu | Sakshi
Sakshi News home page

హోటల్‌ కార్మికులతో కేరళ నటి వాగ్వాదం

Dec 21 2018 12:31 PM | Updated on Dec 21 2018 12:31 PM

Kerala Actress Fight With Hotel Management in Tamil Nadu - Sakshi

గొడవ కారణంగా ఏడుస్తున్న నటి మంజు సవేకర్‌

హోటల్‌ కార్మికులతో కేరళ నటి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

చెన్నై ,పెరంబూరు: హోటల్‌ కార్మికులతో కేరళ నటి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాలు చూస్తే ఒక మలయాళ చిత్రం నాగర్‌కోవిల్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ చిత్ర యూనిట్‌ నాగర్‌కోవిల్‌లోని ఒక హోటల్‌లో బస చేసి షూ టింగ్‌కు హాజరవుతున్నారు. కాగాబుధవారం అర్ధరాత్రి ఆ చిత్ర హీరోయిన్‌ మంజు సవేకర్‌ షూటిం గ్‌ ముగించుకుని హోటల్‌లోని తన గదికి వెళ్లగా గది క్లీన్‌ చేయకపోవడంతో ఆ హోటల్‌ కార్మికులపై వాగ్వాదానికి దిగింది. దీంతో ఈ వ్యవహారం గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు విచారణ జరిపి నటి మంజు సవేకర్‌కు, కార్మికులకు మధ్య గొడవను సర్ది చెప్పి సమస్యను పరిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement