సామికి జోడీ కుదిరింది

Aishwarya Rajessh joins Vikram's Saamy 2 - Sakshi

2003లో వచ్చిన ‘సామి’లో విక్రమ్, త్రిష భార్యాభర్తలుగా యాక్ట్‌ చేశారు. ‘సామి’ సీక్వెల్‌ ‘సామి స్క్వేర్‌’లో కూడా త్రిష యాక్ట్‌ చేస్తారని భావించారందరూ. త్రిష కూడా ముందు ఈ సినిమా కమిట్‌ అయ్యారు. ఆ తర్వాత క్రియేటీవ్‌ డిఫరెన్సెస్‌తో ‘సామి స్క్వేర్‌’ సినిమా నుంచి త్రిష తప్పుకున్నారు. తాజాగా త్రిష ప్లేస్‌లోకి ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్‌గా వచ్చారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీలో జాయిన్‌ అవ్వడం గురించి ఐశ్వర్య మాట్లాడుతూ – ‘‘నా కెరీర్‌లో ఫుల్‌ కమర్షియల్‌ సినిమా ఇప్పటివరకు చేయలేదు. ఈ సినిమా ఆ లోటుని తీర్చేస్తుందని భావిస్తున్నాను. విక్రమ్‌సార్‌ పక్కన, హరి సార్‌ డైరెక్షన్‌లో యాక్ట్‌ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు. సినిమా ఆగస్ట్‌లో రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top