థ్రిల్‌ చేసే ‘ఎవరు’ | Adivi Sesh Evaru Movie Release On 15th August | Sakshi
Sakshi News home page

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

Jul 17 2019 8:29 AM | Updated on Jul 17 2019 8:46 AM

Adivi Sesh Evaru Movie Release On 15th August - Sakshi

‘క్షణం, అమీ తుమీ, గూఢచారి’ వంటి వరుస విజయాల తర్వాత అడివి శేష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎవరు’. వెంకట్‌ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. రెజీనా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నవీన్‌ చంద్ర కీలక పాత్ర చేశారు. పీవీపీ సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్‌15న విడుదల కానుంది. ‘‘థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ‘క్షణం’ వంటి హిట్‌ తర్వాత అడివి శేష్, పీవీపీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement