ఐటీఐ ఆఫీసర్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

విజయవాడ : ప్రభుత్వ ఐటీఐలో జిల్లా స్థాయి ట్రైనింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న కోనేరు శ్రీనివాస్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజయవాడ డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో సోదాలు జరుపుతున్నారు. విజయవాడతో పాటు పెనమలూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో ఏక కాలంలో ఆరు చోట్ల సోదాలు జరుపుతున్నారు.

విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీ, విజయనగర్ కాలనీల్లోని శ్రీనివాస్ కుమార్ నివాసాల్లో జరిపిన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. మూడు కార్లు, వాణిజ్య ట్రక్కులను గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top