బస్సును హైజాక్ చేసి నిప్పంటించారు | Eight killed in bus hijacking in China | Sakshi
Sakshi News home page

బస్సును హైజాక్ చేసి నిప్పంటించారు

Apr 29 2016 8:42 AM | Updated on Sep 26 2018 3:36 PM

చైనాలోని వాయవ్య ప్రాంతం షాంఝి ప్రావిన్స్లో దుండగులు ఓ బస్సును హైజాక్ చేసి నిప్పంటించారు.

బీజింగ్: చైనాలోని వాయవ్య ప్రాంతం షాంఝి ప్రావిన్స్లో దుండగులు ఓ బస్సును హైజాక్ చేసి నిప్పంటించారు. గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ఎనిమిదిమంది మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

షాంఝి రాజధాని ఝియన్ నగరంలో ఫుజోవ్-యించ్వాన్ హైవేపై ఓ టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇంతకు మంచి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇది ఉగ్రవాద చర్యా లేక తిరుగుబాటుదారుల చర్యా అన్న విషయం తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement