ముగ్గురికి జన్మించిన బిడ్డ! | Baby bod born to the Three some | Sakshi
Sakshi News home page

ముగ్గురికి జన్మించిన బిడ్డ!

Sep 29 2016 1:12 AM | Updated on Oct 17 2018 4:13 PM

ముగ్గురికి జన్మించిన బిడ్డ! - Sakshi

ముగ్గురికి జన్మించిన బిడ్డ!

ప్రపంచంలోనే తొలిసారిగా ముగ్గురి ద్వారా ఓ బాబు జన్మించాడు. వివాదాస్పద సరికొత్త సంతానోత్పత్తి విధానంతో ముగ్గురి నుంచి సేకరించిన డీఎన్‌ఏ ద్వారా జోర్డాన్

న్యూయార్క్: ప్రపంచంలోనే తొలిసారిగా ముగ్గురి ద్వారా ఓ బాబు జన్మించాడు. వివాదాస్పద సరికొత్త సంతానోత్పత్తి విధానంతో ముగ్గురి నుంచి సేకరించిన డీఎన్‌ఏ ద్వారా జోర్డాన్  జంటకు జన్మించాడు. బాబు తల్లి లీగ్ సిండ్రోమ్ అనే జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతోంది. దీంతో పుట్టే పిల్లలకు మెదడు, కండరాలు, నాడీ కణాల అభివృద్ధి లోపం ఏర్పడి చనిపోతారు. వారికి పెళ్లయిన పదేళ్ల తర్వాత బిడ్డ పుట్టినా లీగ్ సిండ్రోమ్ ఉండటంతో ఆరేళ్లకు చనిపోయింది.

రెండోసారి ఓ బాబు పుట్టినా 8 నెలలకే మరణించాడు. దీంతో ఈ జంట న్యూయార్క్‌కు చెందిన ‘న్యూ హోప్’ ఫెర్టిలిటీ సెంటర్‌లోని జాన్ జాంగ్‌ను సంప్రదించారు.  తల్లి అండం నుంచి కేంద్రకాన్ని తీసుకుని దాత అండంలోకి ప్రవేశపెట్టారు. ఈ అండాన్ని తండ్రి శుక్రకణాలతో ఫలదీకరణం చెందించారు. పిండాన్ని తల్లి అండాశయంలోకి చొప్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 6న జన్మించిన బాబు ఆరోగ్యంగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement