మరోసారి బాంబు దాడి.. 54మంది మృతి | At least 54 people killed in bomb blasts in Nigeria's Maiduguri | Sakshi
Sakshi News home page

మరోసారి బాంబు దాడి.. 54మంది మృతి

Sep 21 2015 8:06 PM | Updated on Sep 3 2017 9:44 AM

నైజీరియాలో బొకో హారమ్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వారు రెండు చోట్ల బాంబు దాడులు జరపడంతో 54మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు

మైదుగురి: నైజీరియాలో బొకో హారమ్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వారు రెండు చోట్ల బాంబు దాడులు జరపడంతో 54మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు. మరో 90మంది గాయాలపాలయ్యారు. గత జూలై నుంచి ఈ తరహా బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి అని నైజీరియా అధికారులు తెలిపారు.

మైదుగురిలోని అజిలరి అనే ప్రాంతంలో బాంబులు ధరించి వచ్చిన ఓ వ్యక్తి తనను బాంబు విసరడంతోపాటు తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో 54మంది అక్కడికక్కడే చనిపోయారు. గతంలో కూడా మైదుగురి ప్రాంతంలో భారీ స్థాయిలో బాంబు దాడులు చోటుచేసుకుని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement