ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి | 31 killed in suicide blasts targeting police in Iraq | Sakshi
Sakshi News home page

మరోసారి నెత్తురోడిన ఇరాక్‌

Apr 5 2017 7:16 PM | Updated on Nov 6 2018 8:35 PM

ఇరాక్‌ మరోసారి నెత్తురోడింది. తిక్రిత్‌ నగరంలోని పౌరుల్ని, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, 42 మంది గాయపడ్డారు.

బాగ్దాద్‌ : ఇరాక్‌ మరోసారి నెత్తురోడింది. తిక్రిత్‌ నగరంలోని పౌరుల్ని, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, 42 మంది గాయపడ్డారు. మృతి చెందినవారిలో 14మంది పోలీసులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది

కాగా  ఉగ్రవాదులు పోలీస్‌ దుస్తుల్లో వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతదళాలే లక్ష్యంగా పదిమంది ఈ దాడిలో పాల్గొనగా వారిలో ఇద్దరు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఇప్పటి వరకు దాడిని తామే చేసినట్లు ఏ సంస్థా ప్రకటించుకోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement