బోయిన్‌పల్లిలో బాలికపై అత్యాచారం


హైదరాబాద్‌: నగరంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన ఘటన నగరంలోని బోయిన్‌పల్లి ఆర్‌ఆర్‌నగర్‌లో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ బాలిక(16)పై అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా బాలిక ప్రియుడి స్నేహితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top