'అవినీతికి పాల్పడితే సహించేది లేదు' | will not tolerate the corruptioners, says Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'అవినీతికి పాల్పడితే సహించేది లేదు'

Dec 21 2015 5:12 PM | Updated on Sep 22 2018 8:22 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం టీడీఎల్పీ సమావేశం జరిగింది.

హైదరాబాద్: అవినీతికి పాల్పడితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. జన్మభూమిని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యేల వ్యవహారాల్లో మంత్రులు జోక్యం చేసుకోవద్దని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement