నాపై వచ్చిన ఆరోపణలకు ఈ ఎన్నికలే రిఫరెండమని టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు.
- టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్దామరెడ్డి
హైదరాబాద్ : నాపై వచ్చిన ఆరోపణలకు ఈ ఎన్నికలే రిఫరెండమని టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అశ్వత్ధామరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... మెరుగైన పే స్కేల్ టీఎంయూతోనే సాధ్యమని ఆయన అన్నారు. గతంలో తాము కార్మికులకు చేసిన మంచి పనులే తమ గెలుపునకు సోపానాలు అవుతాయని ఆయన తెలిపారు. ఈ దఫా ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో తమ గెలుపు తథ్యమని అశ్వత్థామరెడ్డి జోస్యం చెప్పారు.