ఎర్రగడ్డ ఛాతీ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక ప్రాణాలొదిలిన కృష్ణ నాయక్ కుటుంబ సభ్యులను టీటీడీపీ నాయకులు పరామర్శించారు.
కృష్ణా నాయక్ కుటుంబానికి రేవంత్ పరామర్శ
Mar 15 2017 3:49 PM | Updated on Sep 5 2017 6:10 AM
హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతీ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక ప్రాణాలొదిలిన కృష్ణ నాయక్ కుటుంబ సభ్యులను టీటీడీపీ నాయకులు పరామర్శించారు. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్నగర్ జిల్లా లింగాల మండలానికి చెందిన కృష్ణ నాయక్ కు ఆక్సిజన్ అవసరమైంది. అయితే సిలిండర్ పెట్టడానికి హాస్పిటల్ సిబ్బంది రూ.150 లంచం డిమాండ్ చేశారు.
ఆ డబ్బు ఇచ్చుకోలేనని కృష్ణ నాయక్ మొర పెట్టుకున్న సిబ్బంది కరుణించలేదు. దీంతో కృష్ణ నాయక్ మంగళవారం ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. బుధవారం నాగోల్లోని బండ్లగూడలో నివాసముంటన్న కృష్ణా నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వారికి ఆర్థిక సాయం అందించారు.
Advertisement
Advertisement