ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం : గట్టు | telangana ysrcp president speaks over reorganization of districts | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం : గట్టు

Jun 11 2016 1:53 PM | Updated on Sep 4 2017 2:15 AM

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం : గట్టు

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం : గట్టు

తెలంగాణలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని టీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని టీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో శనివారం ఆయన మాట్లాడుతూ...కొంతమంది పార్టీ వీడినా క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ శ్రేణులు తమతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.  

కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శాస్త్రీయవిధానం అవలంభించాలని గట్టు సూచించారు. రాష్ట్రంలో పాలకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తమ పార్టీ వీడి టీఆర్ఎస్లో చేరిన నేతలు ఇప్పుడు అవమానాలకు గురవుతున్నారన్నారు. ఈ నెల 18 నుంచి 28 వరకు వైఎస్సార్సీపీ అన్ని మండల శాఖల నియామకాలు పూర్తి చేస్తామని గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement