'నగరంలో కోటి మొక‍్కలు నాటుతాం' | Talasani Srinivas Yadav participated in Haritha Haram | Sakshi
Sakshi News home page

'నగరంలో కోటి మొక‍్కలు నాటుతాం'

Jul 15 2017 11:50 AM | Updated on Sep 5 2017 4:06 PM

సనత్‌నగర్‌లోని నల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం హరితహారం కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్ : సనత్‌నగర్‌లోని నల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మొక్కలు నాటారు. హరిత తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి.. వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో కోటి మొక్కలు నాటబోతున్నామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement