నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా శుక్రవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు.
ఇన్ఫోసిస్తో పాటు టీ హబ్ సందర్శించనున్న ప్రధాని
సాక్షి, హైదరాబాద్:
నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా శుక్రవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన నగరానికి చేరుకుంటారు. ఇన్ఫోసిస్ క్యాంపస్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ హబ్ ఇంక్యుబేటర్ వ్యవస్థను సందర్శిస్తారు.
రాత్రి ఆయనకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హోటల్ తాజ్ ఫలక్నుమాలో విందు ఇస్తారని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఆయన నేపాల్ తిరుగు పయనమవుతారని వెల్లడించాయి.