గాంధీలో స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి | Pregnant killed with swine flu in Gandhi | Sakshi
Sakshi News home page

గాంధీలో స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి

Jul 30 2017 3:43 AM | Updated on Sep 5 2017 5:10 PM

గాంధీలో స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి

గాంధీలో స్వైన్‌ఫ్లూతో గర్భిణి మృతి

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో 7 నెలల గర్భిణి మృతి చెందింది.

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో 7 నెలల గర్భిణి మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంకు చెందిన సిరిపురం భవానీ (23) కొద్దిరోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో స్థానికంగా ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చేరింది. ఏడు నెలల గర్భిణి అయిన భవా నీకి వెంటిలేటర్‌పై వైద్యసేవలు అందించారు. వైద్యపరీక్ష ల అనంతరం ఆమెకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో రిఫ రల్‌పై ఈ నెల 26న సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేరింది. డిజాస్టర్‌వార్డులో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

చివరి క్షణాల్లో వెంటిలేటర్‌పై వచ్చిన భవానీని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు వివరించారు. ఈ ఏడాది గాంధీ ఆస్పత్రిలో 165 మంది స్వైన్‌ఫ్లూ రోగులకు వైద్యచికిత్సలు అందించగా..పూర్తిస్థాయిలో వ్యాధి నయమైన 132 మందిని డిశ్చార్జ్‌ చేశామని, 31 మంది మృతి చెందారని, మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూ రోగులకు డిజాస్టర్‌వార్డులో వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement