శ్రీ విజయా ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మణి(22) అనే యువకుడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు.
శ్రీ విజయా హాస్పిటల్ వద్ద ఆందోళన
Nov 7 2016 10:50 AM | Updated on Sep 4 2017 7:28 PM
హైదరాబాద్: ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీ విజయా ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మణి(22) అనే యువకుడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. గుడిమల్కాపూర్కు చెందిన మణి(22) నాలుగు రోజుల క్రితం జ్వరంతో విజయా ఆసుపత్రిలో చేరాడు. అకస్మాత్తుగా జ్వరం ఎక్కువై పరిస్థితి విషమించడంతో మహవీర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. రోగిని మహవీర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే మణి మృతి చెందాడని మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
Advertisement


