ఉమ్మడి హైకోర్టుకు మే 2 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో అత్యవసర కేసుల విచారణకు నాలుగు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు.
అత్యవసర కేసుల విచారణకు నాలుగు వెకేషన్ కోర్టులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు మే 2 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో అత్యవసర కేసుల విచారణకు నాలుగు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు. మే 5, 12, 19, 26 తేదీల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయని రిజిస్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 5న న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు.
12న న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం, జస్టిస్ సి.ప్రవీణ్కుమార్ సింగిల్ జడ్జిగా వ్యవహరిస్తారు. 19న జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్లతో కూడిన ధర్మాసనం, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు సింగిల్ జడ్జిగా కేసులు విచారిస్తారు. 26న జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ బి.శివశంకరరావు సింగిల్ జడ్జిగా కేసులు విచారిస్తారు. అత్యవసర కేసులు దాఖలు చేయాలనుకునేవారు మే 3, 10, 17, 24 తేదీల్లో పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.