రేపు ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం ప్రారంభం | NTR medical test program starts tomorrow, says palle raghunatha reddy | Sakshi
Sakshi News home page

రేపు ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం ప్రారంభం

Dec 31 2015 7:26 PM | Updated on Mar 23 2019 8:59 PM

సమాచారశాఖను ప్రక్షాళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

హైదరాబాద్: సమాచారశాఖను ప్రక్షాళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లో పల్లె రఘునాథరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ...అధికారులు తమ విధుల పట్ల బాధ్యతారహితంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో ప్రారంభిస్తారని పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement