'ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం' | Sakshi
Sakshi News home page

'ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం'

Published Wed, Feb 24 2016 6:53 PM

MLAs buying not a democratic way, says swami agnivesh

హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు అనైతికమని ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి  విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ... న్యూఢిల్లీలోని జేఎన్యూలో విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్పై దేశద్రోహం కేసు పెట్టడం అన్యాయమన్నారు.

కన్హయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకున్నా దేశద్రోహం కేసు పెట్టారని అగ్నివేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోహిత్ విషయంలో బీజేపీ కేంద్రమంత్రులు అత్యుత్సాహం చూపారని స్వామి అగ్నివేశ్ చెప్పారు.
 

Advertisement
Advertisement