- రెండో రోజుకు చేరిన ఉద్యోగుల సమ్మె
- ఎక్కడి కేసులు అక్కడే
- డిమాండ్లు సాధించుకునే దాకా సమ్మె: ఉద్యోగ సంఘం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టుతోపాటు న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులు రద్దు చేయాలంటూ తెలంగాణవ్యాప్తంగా న్యాయశాఖ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండోరోజుకు చేరింది. ఉదయం 10 గంటలకు కోర్టులకు చేరుకుంటున్న ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. న్యాయాధికారులే స్వయం గా తాళాలు తీసుకొని చాంబర్లలో కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. సమ్మెకు వెళ్తున్నం దున ఏడు రోజులకు సంబంధించిన రోజువా రీ కేసుల జాబితాను ఉద్యోగులు ఇప్పటికే న్యాయాధికారులకు అందజేశారు. కనీసం కేసు రికార్డులను కూడా న్యాయాధికారుల ముందుంచే పరిస్థితి లేదు. దీంతో ఒక్క కేసూ విచారించే పరిస్థితి లేకుండా పోయింది.
న్యాయ శాఖ ఉద్యోగులకు మద్దతుగా సోమవారం నుంచి న్యాయవాదులు కూడా ఆందోళనల్లో పాల్గొననున్నారు. ఫలితంగా సమ్మె మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. డిమాండ్లు సాధించుకునే వరకూ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగ సంఘం నేతలు లక్ష్మారెడ్డి, జగన్నాథం, రాజశేఖర్రెడ్డి స్పష్టంచేశారు. హైకోర్టుకు ముందే సమ్మె నోటీసు ఇచ్చినా కనీసం చర్చలకు కూడా పిలవలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. హైకోర్టు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసిందన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
9 వరకు విధుల బహిష్కరణ
న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు లు రద్దు చేయడంతోపాటు న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ విధుల బహిష్కరణ కొనసాగుతుందని న్యాయవాద సంఘాలు స్పష్టం చేశాయి. 4 నుంచి 9 వరకు అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జితేందర్రెడ్డి తెలిపారు. 4న అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన, 5న సర్వమత ప్రార్థనలు, 7న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, జైల్భరో, 8న ఉద్యమానికి మద్దతుగా ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపడతామన్నారు. 9న సమావేశమై తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
స్తంభించిన న్యాయవ్యవస్థ
Published Sun, Jul 3 2016 3:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement