అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5 లక్షల రూపాయల నగదు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా పలు చోరీలకు పాల్పడింది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఈ ముఠాపై 11 కేసులు నమోదయ్యాయి.