ఆర్డీఎస్ ప్రాజెక్టు సమస్యపై కాంగ్రెస్ చేస్తున్న దీక్ష అంతా డ్రామా' అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
హైదరాబాద్: ఆర్డీఎస్ ప్రాజెక్టు సమస్యపై కాంగ్రెస్ చేస్తున్న దీక్ష అంతా డ్రామా' అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాజకీయాల కోసమే కాంగ్రెస్ దీక్ష చేస్తోందంటూ ధ్వజమెత్తారు. మంగళవారం హరీశ్రావు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ది రాష్ట్రానికో సిద్ధాంతమంటూ దుయ్యబట్టారు.
కాంగ్రెస్కు పాలేరులో ఓటమి తప్పదని మంత్రి హరీశ్రావు చెప్పారు. కాగా, ఆర్డీఎస్ సమస్యపై ఈ రోజు మధ్యాహ్నం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలవడానికి టీపీసీసీ బృందం బెంగళూరు వెళ్లనున్న సంగతి తెలిసిందే.