సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ప్రజాస్వామ్య సంఘాల నేతల అరెస్టులను చూస్తుంటే దేశం ఫాసిజం వైపు పయనిస్తోందని అర్థం అవుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ‘చత్తీస్ఘడ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్టును వెంటనే ఎత్తివేసి అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని’ డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వాస్తవాలను తెలుసుకోవటానికివ వెళ్లిన ఉద్యమ నాయకులను అరెస్టు చేయటం దారుణమని విమర్శించారు. దేశంలో ఉన్న వ్యవస్థలన్ని దెబ్బతిన్నాయని, చివరకు న్యాయ వ్యవస్థ కూడ ప్రభుత్వం ఏం చెపుతుందో మరునాడు అదే చెపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను మద్య తరగతి ప్రజలు అర్థం చేసుకోవాలని, లేకుంటే చీకటి రోజులను చూడాల్సి వస్తుందని అన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజల కష్టాలను చూస్తుంటే దేశాన్ని ఎవరైనా పాలించవచ్చు అనిపిస్తుందని అన్నారు. మీడియా రాజ్యం స్వభావాన్ని ప్రశ్నించాలి తప్ప పాలనలో భాగస్వామ్యం కావద్దని సూచించారు.
మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ఊహించానని అన్నారు.
అక్రమ కేసులు పెట్టడాన్ని సాయుధ పోరాటంలోనే చూశానని ఇది ఫ్యూడల్ పద్దతి అని విమర్శించారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ఎవరూ మాట్లాడకూడదు అనే రీతిలో రాజ్యం అణచివేస్తుందన్నారు. ఆదివాసి ప్రాంతాల మీద తీవ్ర నిర్భంధం కొనసాగుతుందని విమర్శించారు. అణచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్ పోలీసులకు అప్పగించిన ఉద్యమ నాయకులు బల్ల రవీందర్, చిక్కుడు ప్రభాకర్, దుడ్డు ప్రభాకర్, బండి దుర్గా ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, నజీర్, రమణాల లక్ష్మయ్యలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు విమలక్క, నలమాసు కృష్ణ, కోటి, గురజాల రవీందర్, ప్రొఫెసర్ లక్ష్మణ్, వి. రఘునాథ్, దేవేంద్ర, నారాయణరావు, కుమారస్వామి, సావిత్రి, కె. కృష్ణ, కనీజ్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
‘ఫాసిజం వైపు దేశం’
Published Sun, Jan 1 2017 2:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement