షర్మిలకు అడుగడుగునా ఆదరణ
తోబుట్టువులా అక్కున చేర్చుకున్న నగరం
తొలిరోజు 8 కుటుంబాలకు పరామర్శ
రాజన్న బిడ్డ రాకతో బాధితుల కళ్లలో సంతోషం
సనత్ నగర్: రాజన్న బిడ్డ, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను హైదరాబాద్ నగరం తోబుట్టువులా అక్కున చేర్చుకుంది. అంతులేని ప్రేమాప్యాయతలను పంచింది. పుట్టింటికి వచ్చిన కుమార్తెలా సంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి.. గాజులు వేసి ఆత్మీయతను పంచింది. ‘చిన్నా... అక్క వచ్చిందిరా...ఒక్కసారి చూడరా’ అంటూ రాజన్న మృతిని తట్టుకోలేక అనంత లోకాలకు వె ళ్లిపోయిన తన బిడ్డను తలచుకుంటూ ఓ తల్లి కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుంటే... ‘నేనున్నాన’ంటూ షర్మిల అందించిన ఓదార్పు ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ‘తల్లీ బాగా చదవాలి... చదువుపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక్క ఫోన్ చెయ్యి... నేను చూసుకుంటా’నంటూ షర్మిల ఇచ్చిన భరోసా ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థినిలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ‘గ్రామ పంచాయతీలో ఏదైనా కొలువు ఇప్పించండమ్మా...’ అని అడగడమే తరువాయి... అక్కడి సర్పంచ్కు ఆ పనిని పురమాయించగానే ‘ఇంటికి పెద్ద దిక్కుగా వచ్చావా తల్లీ...’ అంటూ మరో కుటుంబం మురిసిపోయింది.
మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక గ్రేటర్ హైదరాబాద్లో అశువులు బాసిన కుటుంబాల కోసం ఆయన కుమార్తె షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే ఈ యాత్రలో భాగంగా మొదటి రోజు 8 కుటుంబాలను ఆమె పరామర్శించారు. వెళ్లిన చోటల్లా ‘అధైర్య పడవద్దు... రాజన్న కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుంద’ని భరోసా ఇచ్చారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో పరామర్శ యాత్ర సాగింది. ఈమార్గాల్లో వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేశ్రెడ్డి, రాఘవరెడ్డి తదితరులతో కలిసి మొదటి రోజు షర్మిల పరామర్శ యాత్ర కొనసాగింది.
మా బిడ్డ నీవని...
Published Tue, Jan 5 2016 11:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement