ఐపీఎల్-10 సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
Apr 19 2017 2:00 PM | Updated on Sep 5 2017 9:11 AM
హైదరాబాద్: ఐపీఎల్-10 సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగరంలోని వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ సాగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించారు. బెట్టింగ్కు పాల్పడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.40 లక్షల నగదుతో పాటు 9 సెల్ఫోన్లు, ఓ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు
Advertisement


