రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్ గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై బుధవారం అర్థరాత్రి ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్ గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై బుధవారం అర్థరాత్రి ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకుని, రూ.87వేలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా 8 సెల్ఫోన్లు, ఒక కారు, రెండు బైక్లను స్వాధీనం చేసుకుని, నిందితులను నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.