హయత్‌నగర్‌లో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత | BC welfare hostel students agitation at Hayat nagar | Sakshi
Sakshi News home page

హయత్‌నగర్‌లో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత

Aug 11 2016 9:50 AM | Updated on Nov 9 2018 4:59 PM

హయత్‌నగర్‌ మండలం పసుమాములలో గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం పసుమాములలో గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీసీ సంక్షేమ హాస్టల్‌ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో కలుషిత నీరు తాగి పదో తరగతి విద్యార్థి రాకేశ్‌ మృతిచెందాడు. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. రాకేష్ తల్లిదండ్రులకు హాస్టల్‌ వార్డెన్‌ సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థి రాకేశ్‌ మృతిచెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హాస్టల్‌ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement