మరో 1,069 కొలువులు | Sakshi
Sakshi News home page

మరో 1,069 కొలువులు

Published Wed, Jan 6 2016 3:56 AM

మరో 1,069 కొలువులు - Sakshi

వ్యవసాయ, భూగర్భ జలశాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా వ్యవసాయ, భూగర్భ జలశాఖల్లో 1,069 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఈ నియామకాలు చేపట్టేందుకు టీఎస్‌పీఎస్సీకి అనుమతి ఇచ్చింది. వీటిలో అత్యధికంగా వెయ్యి వ్యవసాయ విస్తరణ అధికారుల (గ్రేడ్-2) పోస్టులున్నాయి. మిగతావన్నీ సాంకేతిక అర్హతలున్న పోస్టులే. కేటగిరీలవారీగా పోస్టుల సంఖ్యతోపాటు వాటి వివరాలను వెల్లడిస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధితశాఖలు పంపించిన ప్రతిపాదనలను పరిశీలించటంతోపాటు వాస్తవ అవసరాలు, ఆర్థికంగా పడే భారమెంత అనే వివరాల్ని సమీక్షించి ఈ పోస్టులకు ఆమోదం తెలిపినట్లు ఆర్థికశాఖ తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement