టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు లేవు...కానీ | No conflicts between TDP and BJP, says Rayapati Sambasiva rao | Sakshi
Sakshi News home page

టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు లేవు...కానీ

Jan 10 2016 12:22 PM | Updated on Oct 17 2018 6:18 PM

టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు లేవు...కానీ - Sakshi

టీడీపీ - బీజేపీ మధ్య విభేదాలు లేవు...కానీ

భవిష్యత్లో సీపీఐ నేతలతో కలసి పనిచేయాలనుకుంటున్నట్లు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు.

గుంటూరు : భవిష్యత్లో సీపీఐ నేతలతో కలసి పనిచేయాలనుకుంటున్నట్లు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఆదివారం గుంటూరులో సీపీఐ నేతలకు ఎంపీ రాయపాటి అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడారు. టీడీపీ - బీజేపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

కేంద్రం ప్యాకేజీలు ప్రకటిస్తుందని కానీ... నిధులు మాత్రం విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనకబడిన ప్రాంతాలకు సాయం అందించాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా రాయపాటి డిమాండ్ చేశారు. రైల్వే జోన్ విజయవాడలో ఏర్పాటు చేయాలనేదే తమ డిమాండ్ అని రాయపాటి సాంబశివరావు గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధిని కోరుతున్నట్లు రాయపాటి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement