నగరంలోని వనస్థలి పురంలో పేకాట స్ధావరాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు.
వనస్థలిపురంలో పేకాటరాయుళ్ల అరెస్టు
Jan 5 2016 9:44 AM | Updated on Sep 3 2017 3:08 PM
వనస్థలిపురం: నగరంలోని వనస్థలి పురంలో పేకాట స్ధావరాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. స్ధానిక ఓ హోటలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం లోని స్వాగత్ గ్రాండ్ హోటల్పై దాడి చేసిన పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 68 వేలు నగదు, పదహారు సెల్ఫోన్లు, ఒక ఇన్నోవా వాహనంతో పాటు అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్ కు తరలించారు.
Advertisement
Advertisement