శంషాబాద్ విమానాశ్రయంలో సోలార్ వెలుగులు | 5MW Solar Power Plant operational at Rajiv Gandhi International Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయంలో సోలార్ వెలుగులు

Jan 12 2016 7:05 PM | Updated on Oct 22 2018 8:31 PM

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జీఎంఆర్ రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటులో ఉత్పత్తి మంగళవారం ప్రారంభమైంది.

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జీఎంఆర్ రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటులో ఉత్పత్తి మంగళవారం ప్రారంభమైంది. దీంతో విమానాశ్రయంలోని టెర్మినల్‌కు అవసరమైన విద్యుత్‌లో 30 శాతం ఈ ప్లాంటు సమకూరుస్తుంది. రెండు మూడేళ్లలో ప్లాంటు సామర్థ్యాన్ని 30 మెగావాట్లకు చేర్చాలన్నది కంపెనీ ప్రణాళిక. తద్వారా విమానాశ్రయంతోపాటు అనుబంధంగా ఉన్న భవనాలకు మొత్తం విద్యుత్ సోలార్ ప్లాంటు అందిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement