ట్రాక్టర్ బోల్తా: మహిళ మృతి, 12 మందికి గాయాలు | 1 dead, 12 injured in tractor accident at ysr district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: మహిళ మృతి, 12 మందికి గాయాలు

Nov 26 2015 9:43 AM | Updated on Sep 3 2017 1:04 PM

వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి వద్ద ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి.

వేముల: వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి వద్ద ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్లచెరువులోని భైరవ స్వామిని దర్శించుకోవడానికి వారంతో ట్రాక్టర్ లో వెళ్లారు. అనంతరం బుధవారం అర్థరాత్రి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతిచెందిన మహిళను వీరపునాయుని పల్లె మండలం బైళ్లచెరువు గ్రామానికి చెందిన సిరిగిరెడ్డి అలివేలమ్మ(55) గుర్తించారు.  గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement