విజయానికి అందరూ మిత్రులే, ఓటమి ఓంటరి. అందుకే లోకమంతా సక్సెస్ వెనుకాల పరుగు తీస్తుంది. విజయాన్ని సొంతం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతుంటారు. ఇక రాజకీయ రంగంలో రాణించేందుకు రాజకీయ నాయకులు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. పవర్ కోసం ఓటర్లకు వాగ్దానాలతో గాలం వేస్తారు. తాము అందలం ఎక్కగానే పేదలను ఉద్దరిస్తామని, పక్కా ఇళ్లు కట్టిస్తామంటూ రకరకాల హామీలతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. పాలకుల హామీలు నీటిమీద రాతలేనని నడుస్తున్న చరిత్రలో ప్రతిచోటా రుజువవుతోంది.
ఇక ప్రజా సంక్షేమ పథకాల ఘనత తమదంటే తమని అధికార, విపక్షాలు తన్నులాడుకోవడం రాజకీయాల్లో షరా మామూలే. యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఆహార భద్రత చట్టం విషయంలోనూ రచ్చ మొదలయింది. ఈ చట్టంలో పలు లొసుగులున్నప్పటికీ పేదలకు కడుపునిండా ఆహారం దొరకుతుందన్న భావనతో దీనికి పార్లమెంట్లో మద్దతు తెలిపాయి.
సోనియా గాంధీ మానస పుత్రికగా ఆహార భద్రతను కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇది సోనియా మానస పుత్రిక కాదని, ఎన్టీఆర్ మానసపుత్రిక అని టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ పేర్కొన్నారు. 1985లో ముఖ్యమంత్రుల సమావేశంలోనే తన తండ్రి ఈ పథకం గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. ఆ తర్వాత కిలో రెండు రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. హరికృష్ణ వ్యాఖ్యలతో ఆహార భద్రత ఎవరి మానస పుత్రిక అన్న చర్చ మొదలయింది.
మరోవైపు యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టాన్ని దేశ చరిత్రలో మైలు రాయిగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్ణించారు. ఆహార భద్రత బిల్లు చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో లాభపడేందుకే కాంగ్రెస్ భో'జన' భద్రత కల్పించిందని బీజేపీ ఆరోపిస్తోంది. రాజకీయ కుమ్ములాటల సంగతి అటుంచి.. పథకం లక్ష్యం నెరవేరితేనే పేదవాడికి నాలుగేళ్లు నోట్లోకి వెళతాయి.
ఎవరి మానసపుత్రిక?
Published Wed, Aug 28 2013 4:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement